TG: రాయితీతో స్థలాల క్రమబద్ధీకరణ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరణ గడువును ఈ నెల 30 వరకు పెంచుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వ హయాంలోనే అనుమతి ఇవ్వగా.. దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం మినహాయింపు ఇచ్చింది.