KNR: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఆమెకు ఉన్న విశ్వాసాన్ని చూపుతుందన్నారు. చిన్న అడుగు శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. కలెక్టర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.