SKLM: అరసవిల్లి ఆదిత్యుని సన్నిధిలో డిఆర్వో ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు ప్రధాన క్షేత్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. చివరగా అరసవిల్లి క్షేత్రంలో ఈ యోగాసనాలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.