KMM: వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో నిన్న అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హనుమాన్ జంక్షన్ ఏపూరికు చెందిన బెజవాడ వెంకటేశ్వరరావు (60) భద్రాచలం నుంచి కార్లో ఏపూరి వెళ్తుండగా లింగపాలెం గ్రామం వద్ద ట్రాక్టర్ను బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.