JGL: రాయికల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యు డు కైరం పురుషోత్తం గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ముంబాయిలో ఉంటున్న పురుషోత్తం గౌడ్ ఆదివారం ఉదయం మృతి చెందగా.. రాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో అంత్యక్రియలు నిర్వహించారు. పురుషోత్తం గౌడ్ మృతికి పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.