VKB: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ఖాంజపూర్ సమీపంలోని తహలే అదీజ్ ఈద్గాలో శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, ఐక్యతతో పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు పాల్గొన్నారు.