MBNR: కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే కృష్ణా నది నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు చుక్క నీరు కూడా రాదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆల్మట్టి ఎత్తును ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. ఎత్తు పెంచితే కృష్ణా కాలువలో క్రికెట్ మ్యాచ్ ఆడడం తప్ప మహబూబ్ నగర్కు చుక్క నీరు రావన్నారు.