WGL: నెక్కొండ MPDO కార్యాలయంలో మంగళవారం(రేపు) 39 గ్రామపంచాయతీల పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి చేపట్టిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా MPDO లావణ్య మాట్లాడుతూ.. అన్ని గ్రామాల సర్పంచులు, GP కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.