GDWL: జిల్లాలోని ఎర్రవల్లి మండలం యక్తాపూర్ గ్రామానికి చెందిన కాశపోగు సుధా రాణికి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా శనివారం లభించింది. గవర్నర్ సమక్షంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ చేతుల మీదుగా ఆమె ఈ పట్టాను అందుకున్నారు. ఈ ఘనత సాధించడంలో తన తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు.