KDP: సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరులో గ్రామ సచివాలయం VHAగా విధులు నిర్వహిస్తున్న ఎం.ప్రవీణ్ కుమార్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల ప్రవీణ్ కుమార్ రెడ్డి పింఛన్ డబ్బుతో పరారైన విషయం తెలిసిందే. అధికారుల ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు పంపారని ముద్దనూరు HO మల్లేశ్వర్ రెడ్డి తెలిపారు.