SDPT: రూరల్ మండలం చింతమడక ప్రాథమిక పాఠశాలను సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల్లో పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, విద్యార్థుల హాజరు, శుభ్రతపై అధికారులను సూచనలు ఇచ్చారు.