BDK: కరకగూడెం మండలం, అశ్వాపురపాడు గ్రామంలో జరిగిన కోవాసి లక్ష్మణ్ హత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించగా, గ్రామస్థుల వాంగ్మూలాలు నమోదు చేశారు. కేసు వెనుక ఉన్న అసలు కారణాలను బయటకు తీయడానికి ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగుతోంది.