MBNR: జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం అధికారులను అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీసీ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే దానిపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులకు సూచించారు.