SDPT: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సిద్దిపేటలో సాయి తేజ సమైక్య పరిధిలోని మహేంద్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ వ్యాపార సంస్థను శుక్రవారం ప్రారంభించారు.