KMM: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ నందు అధికారులు, సిబ్బందికి సైబర్ క్రైమ్ నియంత్రణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక అవగాహన కల్పించారు. పెరుగుతున్న సాంకేతికతతో నేరాల ప్రవృత్తి మారుతున్నదన్నారు.