WNP: పీఎం ఆవాజ్ యోజన సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. పాన్ గల్, బుసిరెడ్డిపల్లిలలో ఇవాళ ఆయన ఆకస్మికంగా పర్యటించారు. పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సర్వే తీరును ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న కుటుంబ వివరాలను సేకరించాలని అధికీరులను ఆదేశించారు.