SRD: పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై దుర్గారెడ్డి హెచ్చరించారు. కంగ్టి మండలంలో ఎవరైనా పేకాట ఆడితే సమచారం ఇవ్వాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పేకాట స్థావరాలు ఏర్పాటు చేసినా, జూదరులకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. పేకాట వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని వివరించారు.