MBNR: సచివాలయంలో రాష్ట్ర మంత్రిగా వాకిటి శ్రీహరి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రికి విన్నవించారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.