ఉమ్మడి జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 613 గ్రామ పంచాయతీల గానూ, 71 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 542 జీపీలకు నేడు పోలింగ్ జరగనుంది. నల్గొండ- 10 మండలాల్లోని 244, సూర్యాపేట- 8 మండలాల్లోని 158, యాదాద్రి- 5 మండలాల్లోని 140 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.