KMM: రఘునాథపాలెం మండలం వీ.వీ. పాలెంకు చెందిన చండ్ర రమేష్కు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంటను ధ్వంసం చేసినట్లు అందిన ఫిర్యాదుపై సీఐ ఉస్మాన్ షరీఫ్ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన కుతుంబాకు రాంప్రసాద్ తన పంటను దున్నించి ధ్వంసం చేశాడని రమేష్ నిన్న ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.