NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిరేకల్ నియోజక వర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్, ఎస్పీలు నోరు మొదపడటంలేదని నకిరేకల్ మాజీ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఆయన స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.