HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒకే ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదు కాగా అక్కడికి వెళ్లి అడిగితే వాళ్ళు ఎవరో మాకు తెలియదని ఆ ఇంట్లో ఉండే మహిళ చెప్పిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. మరొక ఇంట్లో 23 ఓట్లు ఉంటే అక్కడికి వెళ్లీ అడిగితే, వాళ్లు ఎవరో కూడా నాకు తెలీదని ఇంటి ఓనర్ చెబుతున్నారన్నారు.