JGL: ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TG-SET 2025) ఫలితాల్లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ప్రతిభ చాటారు. తెలుగు సబ్జెక్టులో 154 మార్కులతో ఆమె అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 సబ్జెక్టులకు నిర్వహించిన పరీక్షలో మొత్తం 2,565 మంది క్వాలిఫై అవ్వగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించిన జ్యోతిని పలువురు అభినందించారు.