NLG: మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాలిగౌరారం మాజీ వైస్ ఎంపీపీ భూపతి అంజయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంత ఆలస్యమైనా మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు.