SRCL: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్నివేములవాడలో బుధవారం వైభవంగా నిర్వహించారు. వేములవాడ భీమేశ్వర ఆలయం, భీమేశ్వర సదన్లో సామూహిక లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో రాధాబాయి పాల్గొన్నారు.