MDK: రామాయంపేట రైతు వేదికలో గురువారం ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ వ్యవసాయ డివిజన్ అధికారి రాజు నారాయణ తెలిపారు. నిజాంపేట, రామాయంపేట, చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.