BDK: కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తమ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.