విశాఖ: మొంథా తుఫాను నష్టంపై వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తుఫాను బాధితులకు సహాయక చర్యలు, పార్టీ కమిటీల నిర్మాణం అనే రెండు ప్రధాన అంశాలపై చర్చించారు.