JN: ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని దేవుడిని ఆకాంక్షించారు.