MDK: సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఈవో రాధా కిషన్ మంగళవారం తెలిపారు. 21, 22 తేదీల్లో ప్రాథమిక స్థాయి, 24,25 తేదీల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఉపాధ్యాయులు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.