SRPT: రైతు రిజిస్ట్రేషన్కు ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుందని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి సతీష్ తెలిపారు. మండలంలో ఇంకా 5,020 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ లేని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి అందదని ఆయన స్పష్టం చేశారు. వెంటనే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులకు సూచించారు.