KNR: తెలంగాణ భాష నేపథ్యంలో రూపొందించే ఏ సాహిత్య ప్రక్రియ అయినా తెలంగాణ ప్రజల్లో గుండెల్లో చిరకాల నిలిచిపోయే ఆత్మీయతను కలిగి ఉంటుందని సంక్షేమ అధికారి సరస్వతి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక భగవతి పాఠశాలలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతోజు పద్మశ్రీ రచించిన ‘బతుకమ్మ పాటల పల్లకి’ గ్రంథావిష్కరణ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.