WGL: ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలుగా మారుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలు గ్రామస్తులు తదితరులున్నారు.