NGKL: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి కల్వకుర్తి న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా విధించిందని ఎస్సై మాధవరెడ్డి శుక్రవారం తెలిపారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన కాజా మైనుద్దీన్ ఖాన్కు రెండు రోజులు జైలు, రూ.600 జరిమానా, రాచూర్ గ్రామానికి చెందిన కాటిక యాదయ్యకు ఒక రోజు జైలు, రూ.600 జరిమానా విధించినట్లు చెప్పారు.