SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురిసింది. కనీసం 5 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారిపై ప్రయాణం కష్టతరంగా మారడంతో వాహనదారులు హెడ్లైట్లు ఆన్ చేసి, అత్యంత నెమ్మదిగా ప్రయాణించారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.