NZB: కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ప్రజలు బుధవారం పోతంగల్ మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు బజరంగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం లేదన్నారు. వెంటనే స్పందించి కొత్త కార్డులను జారే చేయాలని కోరారు. అలాగే మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలన్నారు.