మన్యం: ప్రతీ ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి సర్వేను పక్కగా చేపట్టాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు స్పష్టం చేశారు. మక్కువ, శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందుతున్న తీరుపై, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించారు.