ASF: దహేగాం మండలం గెర్రే గ్రామంలో తన కుమారుడు కులం తక్కువ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో సత్తయ్య కిరాతకానికి పాల్పడ్డి కోడలు శ్రావణిపై కత్తి, గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. భాదిత కుటుంబాన్ని సోమవారం KVPS జిల్లా నాయకులు పరామర్శించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ఈ ఘటన కుల దురాహంకార హత్య అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.