WNP: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్నంగా ముందుకొస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని మూడు కేజీబీవీల్లో నీట్, జేఈఈ, ఎంసెట్ ప్రవేశ పరీక్ష శిక్షణ తరగతులకు ఎంపిక చేసినట్లు వనపర్తి జీసీడీఓ శుభలక్ష్మి తెలిపారు. ఈ నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు .