BDK: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఇవాళ అడవి శాఖ అధికారులు మణుగూరు నుంచి అశ్వాపురం మీదగా భద్రాచలం క్రాస్ రోడ్డు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులు పిలుపునిచ్చారు. మొక్కల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని ప్రసాదించవచ్చని అన్నారు.