NGKL: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కొల్లాపూర్ మండలంలోని సోమశిల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు, పిల్లలు తెల్లవారుజాము నుంచే చలిని తట్టుకుని కృష్ణా నదిలో స్నానం చేసి, కార్తీక దీపాలను నదిలో వదిలారు. అనంతరం లలితాంబిక సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.