KMM: బోనకల్లో గంజాయి రవాణా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణుడి గుడి సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిరాజును పట్టుకుని, అతని వద్ద నుంచి 2.4 కిలోల గంజాయి, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.