ASF: రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి బవేశ్ మిశ్రని సోమవారం మాజీ MLA ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిశారు. తీర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో అనేక గ్రామాలకు సెల్ సిగ్నల్స్ లేని కారణంగా ప్రజలు, ముఖ్యంగా పింఛన్ దారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సెల్ సిగ్నల్స్ లేని గ్రామాలకు సిగ్నల్స్ అందే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు.