RR: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కారణంగా ప్రస్తుతం డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి. దీంతో డయాలసిస్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి వద్దకు వచ్చిన రోగులను వికారాబాద్, షాద్నగర్ ఆసుపత్రులకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్లలోనే సేవలను అందించాలని రోగులు కోరుతున్నారు.