JGL: మెట్పల్లి మండలం ముత్యంపేట నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని MLC అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెట్పల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెరుకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు.