KMM: రాబోయే రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో డిజిటల్ మీడియా పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన ఆయన, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు, అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.