SRPT: భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దయానందం అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలంలోని కర్విరాల, మానాపురం గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి మాట్లాడారు. భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, కర్విరాలలో-121, మానాపురంలో-46 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.