MDK: ఈనెల 17న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్మాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తపస్ జిల్లా ప్రధానకార్య దర్శి చల్లా లక్ష్మణ్ అన్నారు. చిన్న శంకరంపేట మండలం మడూర్ ఉన్నత పాఠశాలలో పోస్టర్ విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే డీఏలు విడుదల చేయాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, శ్రీహరి, రవిందర్ రెడ్డి,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.