HNK నగరంలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో ఈరోజు పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. విశ్వవాసు నామ సంవత్సరం, కార్తీకమాసం, తృతీయ తిధి, శుక్రవారం సందర్బంగా వివిధ రకాల పూలతో, పూలమాలలతో అలంకరించారు. అలాగే, భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.