విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరు కావాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలలో పార్ట్ టైం/ దినసరి వేతనంతో పని చేస్తున్న 220 మంది సమ్మెలో పాల్గొన్న నేపథ్యంలో వారి 3 నెలల వేతనాన్ని వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు.